ఐదు సార్లు ఎమ్మెల్యేగా…

రాజకీయాల్లో పదవులు రాగానే గర్వం పెరుగుతుందని అంటారు. కానీ అ మాటలకు ఈయన విరుద్దం… అయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అయన ఇప్పటికి సింపుల్ గానే ఉంటారు. సింప్లిసిటీనే మైంటైన్ చేస్తారు. ఆయనే గుమ్మడి నర్సయ్య.. ఈయన ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు . ఎదో పని మీదా అయన హైదరాబాదు కి వచ్చారు . మధ్యాహ్నం వేళ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం తింటూ కనిపించారు . ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం కూడా ఇంతే సింప్లిసిటీని మైంటైన్ చేసారు . బస్సులో ,రైల్లో హైదరాబాద్ కి రావడం , ఆటోలో అసెంబ్లీకి వెళ్ళడం , పార్టీ ఆఫీస్ లో పడుకోవడం ఇది అయన ట్రాక్ రికార్డు .. ఇప్పటికి అయన పేరు మీదా ఓ పొలం తప్ప మరేమీ లేదు .. ఇంతా సింప్లిసిటీగా బతికే లీడర్ ని ఇక మనం భవిషత్తులో చూడలేం కావచ్చు బహుశా .. ! గ్రేట్ లీడర్
ఆ కాలంలో నక్సల్స్ ప్రాబల్యమున్నప్పటికీ గన్మెన్లను తిరస్కరించిన గొప్ప నాయకుడు గుమ్మడి నర్సయ్య. అప్పట్లో ఇద్దరు గన్మెన్లను ప్రభుత్వం కేటాయిస్తే వద్దని చెప్పి వారించిన గ్రేట్ లీడర్ ఆయన. ఆయనకు ఎమ్మెల్యే భృతి కింద వచ్చిన మొత్తాన్ని కూడా పార్టీని నడిపించడానికి ఇచ్చారనే టాక్ ఉంది. అదలావుంటే ఇప్పటికీ కూడా ఆయన వ్యవసాయంపైనే ఆధారపడుతూ జీవనం సాగిస్తుండటం విశేషం.
అవినీత మరకలేని గొప్ప నాయకుడు
నియోజకవర్గాల పునర్విభజనతో రెండుసార్లు ఓటమి చెందారు. అయినా కూడా జనం మధ్యలోనే ఉన్నారు. ఓడిపోతే కొందరు పార్టీలు మారుతుంటారు. కానీ గుమ్మడి నర్సయ్య ఎప్పుడూ అలా చేయలేదు. తాను నమ్మిన సిద్దాంతాల కోసం పనిచేస్తూ ముందుకు కదిలారు. అందుకే ఆయనంటే ప్రజల్లో ఒకింత అభిమానం కనిపిస్తుంది. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఏనాడు కూడా అవినీతిని దరిచేరనివ్వని గొప్ప నాయకుడు. అందుకే సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మినారాయణ ఆయన్ని గొప్పగా సన్మానించారు. అంతేకాదు ఆయనకు పాదాభివందనం కూడా చేయడం విశేషం.