యోగి ఆదిత్యనాథ్ – రాజ యోగి

యోగి ఆదిత్యనాథ్ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. భారతీయ జనతాపార్టీ నుండి ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు.
అసలు పేరు అజయ్ సింగ్ బిస్థ్. సన్యాసం స్వీకరించిన తరువాత … మహంత్ Yogi Adityanath గా మార్చుకున్నాడు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారమ్ చేసిన తరువాత ఒక నెల రోజులు పాటు అవినీతి,నేర చరిత్ర ఉన్న అధికారుల రికార్డులు పరిశీలన కోసం కేటాయించారు యోగీజీ. అందరూ కింద నుండి నరుక్కురావాలి అనే సిద్ధాంతాన్ని ఫాలో అయితే యోగీజీ మాత్రం పై నుండి నరుక్కురావాలి అనే సిద్ధాంతాని ప్రతిపాదించారు. పై వాడు తినే రకం అయితే కింద వాడు ఉపవాసాలు ఉంటాడా ? ఉత్తరప్రదేశ్ లోని అధికారుయాలకి చెప్పకుండానే ఆదేశాలు వెళ్ళాయి. నేరస్తుల కొమ్ము కాసే అధికారులకి ఉత్తరప్రదేశ్ లో చోటు లేదు అంటూ. మొదట్లో అందరు ముఖ్యమంత్రులు ఇలానే అంటారు తరువాత షరా మామూలే. కానీ నెల తిరిగేసరికి అధికారులకి అసలు సినిమా కనపడింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న నేరస్తుల నాన్ బెయిలబుల్ వారంట్ల కి రెక్కలు వచ్చాయి కాదు జెట్ ఇంజిన్లు వచ్చాయి. అరెస్టుల పర్వం మొదలవగానే ఇన్నాళ్లూ మా దగ్గర లక్షల రూపాయల లంచం తీసుకొని ఇప్పుడు మమ్మల్నే అరెస్టు చేస్తారా అంటూ మాఫియా గాంగుల హెచ్చరికలతో వీళ్ళు నోరు విప్పితే తమకి జైలు కూడు తప్పదు అనుకోని వరుస ఎంకౌంటర్లతో దొరికిన వాడిని దొరికినట్లు లేపేశారు పోలీసు అధికారులు. నిజానికి యోగీజీ ప్రత్యేకంగా ఏమీ ఆదేశాలు ఇవ్వలేదు. ఆ పరిస్థితులు కల్పించారు అంతే! నువ్వు ఉద్యోగం చేయాలంటే నీ డ్యూటీని నువ్వు చేయాలి లేదా మాఫియా చేతిలో చావాలి. ఇష్టం లేని వారు రాజీనామ చేసి వెళ్లిపోవచ్చు. వెల్ ! రాజీనామ చేసిఇంట్లో కూర్చుంటే మాఫియా చేతిలో చావాలి లేదా అప్పటివరకూ తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలి. మన డ్యూటీ మనం చేయడమే బెస్ట్.
ఉత్తరపదేశ్ లో దశాబ్దాలుగా ఊడలు దిగిన వట వృక్షంలా పాతుకుపోయిన నేర సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా పెరికి వేశారు యోగీజీ. ఎనకౌంటర్లలో పోయిన వాళ్ళు పోగా కొంతమంది నేరుగా లొంగిపోయి జైళ్ళలో ఉన్నారు మిగిలిన వారు పక్కనే ఉన్న ఢిల్లీలో తల దాచుకున్నారు. మరికొంతమని నేపాల్ వెళ్ళి అక్కడనుండి దొంగ పాస్పోర్ట్లతో పాకిస్తాన్ పారిపోయారు.
రెడ్ టెపిజమ్ : సచివాలయం తో సహా రాష్ట్రం మొత్తం ఉన్న ప్రభుత్వ కార్యాలయా లు అన్నీ గుట్కా ఉమ్ములతో అసహ్యంగా ఉండేవి. యోగీజీ వాటిని నిషేధించారు. ఇప్పుడు అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రంగా ఉంటున్నాయి. ఇక రాజకీయ పలుకుబడి ఉన్నవారి లేదా లంచాలు ఇచ్చినవారి ఫైల్స్ మాత్రమే వెంటనే ఆమోదం పొందేవి గతంలో. ఇప్పుడు ఎలాంటి ఫైల్స్ పెండింగ్ లో ఉండడానికి వీలు లేదు ఒకవేళ పెండింగ్ లో ఉంటే అది ఎందుకు పెండింగ్ లో ఉందో వివరంగా ఒక నోట్ వ్రాయాలి సంబంధిత అధికారి తేదీ,సమయంతో సహా …లేదా ఉద్యోగం వదులుకోవాలి. అవినీతికి అలవాటు పడ్డ IAS,IPS,IRS అధికారులు తమ సొంత గూటికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ మాయావతి,అఖిలేశ్ ల హయాంలో ఢిల్లీల్లో వివిధ శాఖలలో పనిచేసేవారు అక్కడనుండి UP కి డిప్యోటేషన్ మీద వచ్చి పాతుకుపోయారు.
UP అంటే విద్యుత్ కోత కి పెట్టింది పేరు. యోగీజీ వచ్చిన తరువాత ఇప్పుడు 24 గంటలు విద్యుత్ అందిస్తున్నారు.